తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీశాఖ సిబ్బందిపై దాడి.. ఒకరి తలకు తీవ్ర గాయం - అటవీశాఖ సిబ్బందిపై దాడి వార్తలు

భూపాలపల్లి జిల్లా పెగడపల్లిలోని ఓ ఇంట్లో వన్యప్రాణి మాంసం ఉందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు తనిఖీ చేపట్టేందుకు ప్రయత్నించగా ఆ ఇంటి వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారిపై దాడి కూడా చేయగా.. బేస్ క్యాంప్ సభ్యుడు మహమ్మద్ ఇబ్రహీం తలకు తీవ్ర గాయలయ్యాయి.

అటవీశాఖ సిబ్బందిపై దాడి.. ఒకరి తలకు తీవ్ర గాయం
అటవీశాఖ సిబ్బందిపై దాడి.. ఒకరి తలకు తీవ్ర గాయం

By

Published : Sep 15, 2020, 7:54 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ ఇంట్లో వన్యప్రాణి మాంసం ఉందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు తనిఖీ చేపట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులను ఆ ఇంటి వ్యక్తులు అడ్డుకోవడమే కాక చితకబాదారు.

ఈ ఘటనలో బేస్ క్యాంప్ సభ్యుడు మహమ్మద్ ఇబ్రహీం తలపై గాయాలు కాగా తీవ్రంగా రక్తం పోయింది. మరో బేస్ క్యాంప్ సభ్యుడు బాలు, అతనితోపాటు రెడ్డిపల్లి బీట్ అధికారి కిరణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషయమై మహాముత్తారం పోలీస్ స్టేషన్లో అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:భూ పంచాయితీ విషయంలో తీర్మానానికి వెళ్లిన సర్పంచ్​పై దాడి

ABOUT THE AUTHOR

...view details