తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2021, 12:05 PM IST

ETV Bharat / state

కరోనా టీకా తీసుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు

కరోనా టీకాపై ప్రజల్లో అవగాహన పెరిగింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరుశరాంపల్లికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు కరోనా టీకా తీసుకుంది.

covid vaccine, corona vaccine, bhupalpally district
కొవిడ్ వ్యాక్సిన్, కరోనా టీకా, వృద్ధురాలికి కరోనా టీకా, భూపాలపల్లి జిల్లా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేటలో పరుశరాంపల్లికి చెందిన 105 ఏళ్ల వృద్ధురాలు చింతిరెడ్డి ఆగమ్మ కరోనా టీకా తీసుకున్నారు. ఈ విషయాన్ని చెల్పూరు ఇంఛార్జ్ వైద్యాధికారిణి ఉమాదేవి ధ్రువీకరించారు.

అంతటి వృద్ధురాలే ధైర్యంగా టీకా తీసుకున్నారని, కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఎవరూ అపోహలకు గురికావొద్దని వైద్యాధికారిణి తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు.

టీకా వేయించుకుంటున్న 105 ఏళ్ల వృద్ధురాలు ఆగమ్మ

ABOUT THE AUTHOR

...view details