తెలంగాణ

telangana

ETV Bharat / state

అబద్ధమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేసీఆర్ - రైతు బంధుపై సీఎం కేసీఆర్​

దుబ్బాక ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారాలు చేస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చేయలేరని పేర్కొన్నారు. సోషల్‌ మీడియా కాదు... యాంటీ సోషల్‌ మీడియా పనిచేస్తోందన్నారు.

kcr
kcr

By

Published : Oct 31, 2020, 4:08 PM IST

Updated : Oct 31, 2020, 5:32 PM IST

కేంద్ర ప్రభుత్వం పింఛన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ మండిపడ్డారు. పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని... కాదని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

రాష్ట్రంలో 38,64,751 మందికి పింఛన్లు ఇస్తున్నాం. ఒక్కో వ్యక్తికి రూ.2,016 అందిస్తున్నాం. కేంద్రం తరఫున 6,95,000 మందికి మాత్రమే పింఛన్లు అందిస్తున్నారు. పింఛను లబ్ధిదారుల్లో కేవలం 6,95,000 మందికి మాత్రమే కేంద్రం రూ.200చొప్పున ఇస్తుంది.

- కేసీఆర్​

అబద్ధమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేసీఆర్

ఇదీ చదవండి :రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి: కేసీఆర్​

Last Updated : Oct 31, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details