జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలోని పెద్ద చెరువులో జక్కరయ్య, పాలయ్య అనే ఏడేళ్ల వయసున్న ఇద్దరు విద్యార్థులు మునిగి చనిపోయారు. మృతి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. రోజువారీగా బడికి వెళ్లకుండా తమ ఇళ్ల పక్కనే ఉన్నా చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మరణించారు. అది చూసి వారి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
రెండిళ్లలో పెద్దోళ్లే..