తెలంగాణ

telangana

Telangana formation day: 'బంగారు తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం'

బంగారు తెలంగాణ లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోజాతీయ జెండా ఎగురవేసి.. అమరులకు నివాళులు అర్పించారు.

By

Published : Jun 2, 2021, 3:07 PM IST

Published : Jun 2, 2021, 3:07 PM IST

Telangana formation day in janagama
Telangana formation day in janagama

జనగామ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు నిబంధనలు పాటిస్తూ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని నేతలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

తెలంగాణని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసిన పోరటాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదీ చుడండి: Rs praveenkumar: కరోనా కారణంగా గురుకుల ఇంటర్ ప్రవేశాల పరీక్షలు రద్దు

ABOUT THE AUTHOR

...view details