తెలంగాణ

telangana

By

Published : May 11, 2020, 10:15 AM IST

ETV Bharat / state

మీరు గెలిపించారు.. మేం అండగా ఉంటాం

తన భార్యను ఏకగ్రీవ సర్పంచ్​గా గెలిపించిన గ్రామస్థులను ఆదుకున్నారు జనగామ జిల్లా తరిగొప్పుల మండల అబ్దుల్ నాగారం గ్రామ నివాసి అర్జుల సంపత్ రెడ్డి. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

rice distributed to needy in jangaon district
జనగామలో సరకుల పంపిణీ

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగరం గ్రామానికి చెందిన అర్జుల సంపత్ రెడ్డి రేషన్​కార్డు దారులకు 5 కిలోల బియ్యం, కిలో పప్పు ధాన్యాన్ని పంపిణీ చేశారు. గ్రామంలో ఏ ఒక్కరు ఆకలితో బాధ పడకూడదని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తన భార్యను సర్పంచ్​గా గెలిపించిన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని భరోసానిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణకుమారి, ఎస్సై హరిత, జడ్పీటీసీ పద్మజ, ఎంపీపీ అరిత సుదర్శన్, సర్పంచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details