జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ రోజు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
జనగామ కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా
ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకి దిగారు.
Breaking News
విజయారెడ్డిని సజీవదహనం చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని, హత్యకు ప్రేరేపించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం