తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు ధర్నాకి దిగారు.

By

Published : Nov 6, 2019, 3:27 PM IST

Breaking News

జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ రోజు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

విజయారెడ్డిని సజీవదహనం చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని, హత్యకు ప్రేరేపించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

జనగామ కలెక్టరేట్​ ఎదుట రెవెన్యూ ఉద్యోగుల ధర్నా

ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్​ చేస్తూ వ్యాజ్యం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details