తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మసాగర్​లో తెరాస ఎన్నికల సన్నాహక సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనగాం జిల్లాలో తెరాస ఎన్నికల సన్నాహక  సమావేశం నిర్వహించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే డా.టి రాజయ్య తెలిపారు.

By

Published : Apr 21, 2019, 7:56 AM IST

రాజయ్య


జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని తెరాస స్థానిక సంస్థ ఎన్నికల సన్నాహక సమావేశం ధర్మసాగర్​లో నిర్వహించారు. ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని, కష్టపడిన వారికీ, సీనియర్ నేతలకు తగిన గుర్తింపు లభిస్తుందని స్థానిక ఎమ్మెల్యే డా.టి రాజయ్య తెలిపారు.

ధర్మసాగర్​లో తెరాస ఎన్నికల సన్నాహక సమావేశం
ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తెరాసకు పూర్తి మద్దతిచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సవాలుగా తీసుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details