తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాల తిప్పలు

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించింది. జనగామ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో టీవీలు లేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వారిని పాఠశాలకు రప్పించి చరవాణి ద్వారా ఆన్​లైన్​ తరగతులు వినేలా చర్యలు తీసుకుంటున్నారు.

By

Published : Sep 3, 2020, 4:13 PM IST

విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాల తిప్పలు
విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాల తిప్పలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించింది. 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు దూరదర్శన్, టీ షాట్​ ద్వారా ఒక్కో తరగతి ఒక్కో సబ్జెక్టు బోధన సాగుతోంది. జనగామ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పాఠాలను కొంత మందే వింటున్నారు. విద్యార్థులకు పొలం పనులు ఉండటంతో సకాలంలో ఆన్​లైన్​ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు.

కొంత మంది విద్యార్థులకు ఆన్​లైన్​ పాఠాలపై అవగాహన లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఛానల్ పెట్టించి చూసేలా చేస్తున్నారు. టీవీలు, చరవాణులు లేని విద్యార్థులను పాఠశాలకు రప్పించి చరవాణి ద్వారా ఆన్​లైన్​ తరగతులు వినేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details