చెట్లను బతికించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. వాటిని నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హెచ్చరించారు. జనగామ-నర్మెట్ట రహదారి పక్కన బత్తిని అశోక్ అనే వ్యక్తి హరితహారంలో నాటిన మొక్కలను నరికివేస్తూ తగలబెట్టాడు. అదే సమయంలో రహదారిపై అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి.. ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మొక్కలు నరికిన వ్యక్తిపై కేసు - జనగామ జిల్లా తాజా వార్తలు
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను నరికి వేస్తూ తగలబెడుతున్న ఓ వ్యక్తికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మొక్కలు నరికిన వ్యక్తికి ఎమ్మెల్యే కౌన్సెలింగ్
అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల అశోక్పై కేసు నమోదు చేసినట్లు జనగామ పట్టణ సీఐ మల్లేశ్ తెలిపారు. ఎమ్మెల్యే సూచన మేరకు అశోక్తో అదే ప్రాంతంలో మరో 5 మొక్కలను నాటించినట్లు తెలిపారు.