రంజాన్ పండుగ సందర్భంగా జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధీదారులకు చెక్కులను అందించారు.
'ఇంట్లోనే రంజాన్ చేసుకోండి: ఎర్రబెల్లి' - నిత్యావసరాల పంపిణీ
కరోనా కష్టకాలంలో రంజాన్ మాసం వచ్చిందని... పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పాలకుర్తిలో చెక్కుల పంపిణీ చేసిన ఆయన అందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
!['ఇంట్లోనే రంజాన్ చేసుకోండి: ఎర్రబెల్లి' minister-errbelli-dayakar-rao-about-ramzan-festival-in-janagoan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7305153-thumbnail-3x2-minis.jpg)
'పండుగను ఇంట్లో ఉండే చేసుకోండి'
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో రంజాన్ పండుగ వచ్చిందని... కాబట్టి పండుగను ఎవరింట్లో వారే చేసుకోవాలని సూచించారు. దూరం పాటిస్తూ... జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు.
ఇవీ చూడండి:కార్పొరేటర్ దంపతులకు జరిమానా వేసిన కేటీఆర్... ఎందుకంటే..?