రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జనగామ జిల్లాలోని దేవరుప్పుల, పాలకుర్తి, జఫర్గడ్ మండలాల్లో పర్యటించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిన పంటల పొలాలను పరిశీలించారు.
'నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు' - నీటమునిగిన పంటలు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
అకాల వర్షానికి కకావికలమైన జనగామ రైతుల పంటపొలాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. నష్టపోయిన కర్షకులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
!['నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు' minister errabelli dayaka rao visited fields in janagaon district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6480761-thumbnail-3x2-aa.jpg)
'నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు'
'నష్టపోయిన అన్నదాతలు అధైర్యపడొద్దు'
పంట నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అన్నదాతలెవరూ అధైర్యపడవద్దని, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.