జనగామ జిల్లా పెద్దపహాడ్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మామిడి కాయల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల కాలంలో కరెంట్, ఎరువుల కోసం రోడ్లపై రైతులు ధర్నాలు చేసేవారని విమర్శించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
'కరవు సీమను గోదావరి జలాలతో తడిపాం'
రైతుల బాగుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. కరవు ప్రాంతమైన జనగామను గోదావరి జలాలతో తడిపిన మహనీయుడని కొనియాడారు.
కరవు సీమను గోదావరి జలాలతో తడిపాం
రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు గోదాముల నిర్మాణము చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మామిడి చెట్టు నుంచి కాయలను కోశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ నిఖిల తదితరులు పాల్గొన్నారు.