తెలంగాణ

telangana

By

Published : Aug 15, 2020, 1:16 PM IST

ETV Bharat / state

జిల్లావ్యాప్తంగా నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు

జనగామ జిల్లా వ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్​లో చీఫ్ విప్​ బోడకుంటి వెంకటేశ్వర్లు, స్టేషన్​ ఘన్​పూర్​లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జాతీయ జెండా ఆవిష్కరించారు.

independent day celebrations in janagama district
జిల్లావ్యాప్తంగా నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు

జనగామ కలెక్టరేట్​లో నిర్వహించిన 74 వ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ చీఫ్​ విప్​ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరై... జాతీయ జెండా ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి వల్ల వేడుకలు ఘనంగా నిర్వహించుకోలేకపోతున్నామని అన్నారు. వైరస్​ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మరణాల రేటులో రాష్ట్రం చివరి స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్​ నిబంధనలు పాటించి... కరోనాను పారదోలాలని విజ్ఞప్తి చేశారు.

స్టేషన్ ఘన్​పూర్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జెండా ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా, స్వతంత్ర భావాలతో జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా రక్కసి నుంచి బయటపడేందుకు మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, హమీద్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి, డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details