తెలంగాణ

telangana

ETV Bharat / state

అటెండర్​ దగ్గర లంచం డిమాండ్​..ఏసీబీకి చిక్కిన జలగలు - ACB CAUGHT BRIBERS IN JANAGON

తమ దగ్గర అంటెండర్​ విధులు నిర్వర్తించిన వ్యక్తి వద్దనే లంచం డిమాండ్​ చేశారు ఆ అవినీతి అధికారులు. రిటైర్మెంట్​ అయ్యాక పింఛన్​ డబ్బుల కోసం సంతకాలు పెట్టమంటే... కసురుకున్నారు. లంచం ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా కనికరం చూపలేదు. చివరికి అనిశాకు అడ్డంగా దొరికిపోయారు.

GOVERNMENT OFFICERS CAUGHT TO ACB IN JANAGON
GOVERNMENT OFFICERS CAUGHT TO ACB IN JANAGON

By

Published : Feb 22, 2020, 7:40 PM IST

జనగామలోని షెడ్యూలు కులాల జిల్లా అభివృద్ధి శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. కార్యాలయంలో పనిచేసిన అటెండర్​ రెనుకుంట్ల ఐలయ్య 2 నెలల క్రింద పదవీ విరమణ పొందాడు. ఐలయ్యకు రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులకు సంబంధించిన ఫైల్స్​పై సంతకాలు చేసేందుకు అధికారి గట్టుమల్లు, సూపరింటిండెంట్ ఖదీర్... రూ. 10వేలు డిమాండ్​ చేశారు.

లంచం ఇచ్చుకొనని బాధిత వ్యక్తి ప్రాధేయపడగా... రూ. 5 వేలకు బేరం కుదుర్చుకున్నారు. లంచం ఇచ్చేందుకు మనసొప్పని ఐలయ్య... అనిశాను ఆశ్రయించాడు. మొత్తం విషయాన్ని వివరించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకుని.... కేసు నమోదు చేశారు.

అటెండర్​ దగ్గర లంచం డిమాండ్​..ఏసీబీకి చిక్కిన జలగలు

ఇదీ చూడండి :మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details