తెలంగాణ

telangana

By

Published : May 12, 2020, 12:39 PM IST

ETV Bharat / state

'కరోనా నుంచి రక్షించిన ఆశాకిరణాలు.. ఆశావర్కర్లు'

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే ఆశాకిరణాలుగా ఆశావర్కర్లు నిలిచారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్​ ఘనపూర్​లో ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.

groceries to asha workers in jangaon
జనగామలో సరకుల పంపిణీ

కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్​ ఘనపూర్​లో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో ఆశా వర్కర్లు ఆశాకిరణాలుగా వ్యవహరించారని ప్రశంసించారు.

వైద్య సిబ్బందికి తోడు ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివని కడియం అన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య వివరాల సేకరణే కాకుండా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచనలు చేశారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details