కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి.. ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలో ఆశా వర్కర్లు ఆశాకిరణాలుగా వ్యవహరించారని ప్రశంసించారు.
'కరోనా నుంచి రక్షించిన ఆశాకిరణాలు.. ఆశావర్కర్లు'
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించే ఆశాకిరణాలుగా ఆశావర్కర్లు నిలిచారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.
జనగామలో సరకుల పంపిణీ
వైద్య సిబ్బందికి తోడు ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది చేసిన సేవలు వెలకట్టలేనివని కడియం అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య వివరాల సేకరణే కాకుండా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచనలు చేశారని తెలిపారు.