తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2020, 3:09 PM IST

ETV Bharat / state

మృగశిర కార్తె.. పెరిగిన చేపల కొనుగోళ్లు

మృగశిర కార్తె సందర్భంగా చేపల విక్రయాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొనుగోలుదారులు జలాశయాల వద్దకే వెళ్లి చేపలు కొనుక్కోవడంతో జలాశయాల వద్ద సందడి నెలకొంది.

fishes purchases increased in janagama
మృగశిర కార్తె సందర్భంగా పెరిగిన చేపల కొనుగోళ్లు

మృగశిర కార్తె సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్​లో ప్రజలు పెద్ద ఎత్తున చేపల కొనుగోళ్లు చేస్తున్నారు. మత్స్యకారులు మండల కేంద్రంలోని జలాశయం నుంచి చేపలు పట్టుకొస్తూ... అమ్ముకుంటున్నారు. మృగశిర కార్తె సందర్భంగా చేపల ధరతో పాటు విక్రయాలు పెరిగిపోయాయి.

కొందరయితే జలాశయం వద్దకే వెళ్లి చేపలను కొనుక్కుంటున్నారు. కొనుగోలు దారులతో జలాశయం వద్ద సందడి నెలకొంది. ఒక్కో చేప 20 కిలోల చొప్పున ఉండటం వల్ల కొనుగోలుదారులు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇవీ చూడండి:కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details