తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 4:31 PM IST

ETV Bharat / state

ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని.. ప్రభుత్వమే ఆదుకోవాలి : భాజపా

ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు.. వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని భాజపా నేత సాగర్​ డిమాండ్​ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని.. ప్రభుత్వమే ఆదుకోవాలి : భాజపా
ప్రైవేట్ పాఠశాలల సిబ్బందిని.. ప్రభుత్వమే ఆదుకోవాలి : భాజపా

జనగామ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు... భాజపా నేతలు నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్టేషన్ ఘన్​పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపు వందమందికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు నేతలు తాళ్లపల్లి సాగర్, ఎన్నారై అనిల్ రెడ్డి తెలిపారు.

లాక్​డౌన్​ కారణంగా ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు రోడ్డున పడ్డారని సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండటం వల్లే తాము ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్​ సమావేశం

ABOUT THE AUTHOR

...view details