జనగామ జిల్లా కేంద్రంలో జీఎస్టీ పరిహారాలను రాష్ట్రాలకు చెల్లించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2 లక్షల 35వేల కోట్ల రాబడి తగ్గిందని.. రాష్ట్రాలు అప్పులు చేసైనా.. పరిపాలన కొనసాగించాలని చెప్పడం సిగ్గులేని చర్య అని ఆయన మండిపడ్డారు. వెంటనే రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న పౌరహక్కుల నేతలను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని.. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తన కారుపై దాడి జరిపిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
జీఎస్టీ పరిహారం రాష్ట్రాలకు చెల్లించాలి : చాడ వెంకట్రెడ్డి - జీఎస్టీ పరిహారం
రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాలను చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జీఎస్టీ పరిహారంలో రాష్ట్రాలకు వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు.

జీఎస్టీ పరిహారం రాష్ట్రాలకు చెల్లించాలి : చాడ వెంకట్రెడ్డి