Young people attack each other: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గిర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గ్రామంలో రెండు వినాయక విగ్రహాలను నిమజ్జనానికి మండపాల నిర్వహకులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒకరి వెనుక ఒకరు శోభాయాత్రకు వెళ్తున్న విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. రెండు మండపాల వారు ఘర్షణ పడుతూ చివరికి కత్తులతో దాడులు చేసుకున్నారు.
వినాయక నిమజ్జనంలో కత్తులతో దాడి చేసుకున్న యువకులు - telanagana crime news
Young people attack each other: అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకొంది. జగిత్యాల జిల్లాలో ఓ గ్రామంలో ఒకే రోజు రెండు వినాయక విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం నిర్వహించగా మండపాల నిర్వాహకులు శోభయాత్రకు తీసుకెళ్లే విషయంలో మాట మాట పెరిగి చివరికి కత్తులతో దాడి చేసుకొనే పరిస్థితికి వచ్చింది. ఇందులో పలువురికి తీవ్ర గాయలయ్యాయి.
![వినాయక నిమజ్జనంలో కత్తులతో దాడి చేసుకున్న యువకులు Vinayaka immersion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16359871-217-16359871-1663065824396.jpg)
Vinayaka immersion
ఇందులో పలువురికి గాయాలు కావడంతో వెంటనే కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: