తెలంగాణ

telangana

తల్లీదండ్రుల గొడవ...బాలుడి ఆత్మహత్యాయత్నం

నిత్యం తల్లిదండ్రులు గొడవలు చూసి పదేళ్ల బాలుడు తట్టుకోలేకపోయాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా రాయపట్నంలో వెలుగుచూసింది.

By

Published : Jul 10, 2019, 7:09 PM IST

Published : Jul 10, 2019, 7:09 PM IST

తల్లిదండ్రుల ప్రేమకై...బాలుడు ఆత్మహత్యాయత్నం

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన శ్రీనివాస్​కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మమతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తరచూ గొడవ పడేవారు. గత కొన్నాళ్లుగా గొడవను చూసిన బాలుడు మనస్థాపం చెందాడు. తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యానని మనోవేదనతో పదేళ్ల బాలుడు శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. జగిత్యాల ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణపాయమేమి లేదని వైద్యులు స్పష్టం చేశారు. అమ్మనాన్నలు అన్యోన్యంగా, ఆనందంగా ఉంటే పిల్లలు ఆనందంగా ఉంటారు. అమ్మనాన్నలు ఒక్కసారి ఆలోచించండి...మీ పిల్లల సంతోషాన్ని గుర్తుంచుకోండి.

తల్లిదండ్రుల ప్రేమకై...బాలుడు ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details