తెలంగాణ

telangana

ETV Bharat / state

"క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి"

క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రీనివాస్​ తెలిపారు. మెట్​పల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పలువురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులను అందించారు.

By

Published : May 25, 2019, 1:30 PM IST

క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో క్షయ వ్యాధి నిర్ధారణపై వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో క్షయ వ్యాధి నివారణ జిల్లా అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వ్యాధి పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని శ్రీనివాస్​ తెలిపారు. ఈ వ్యాధిని మందుల ద్వారా తగ్గించుకోవచ్చని సూచించారు. క్షయ పట్ల ఏమాత్రం అలసత్వం వహించిన చాలా ప్రమాదమన్నారు. అనంతరం పలువురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఈ అవగాహన సదస్సులో పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు.

క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details