తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రాక్టర్​లో ఇసుక లోడ్​తో వెళ్తూ ప్రాణాలు వదిలాడు

ఎప్పటి మాదిరిగానే ఇసుక తరిలించేందుకు యత్నించాడు. ట్రాక్టర్ నిండా లోడ్​తో గట్టు ఎక్కించే క్రమంలో బోల్తా పడి ప్రాణాలు కోల్పోయాడు.

By

Published : Apr 18, 2019, 12:53 PM IST

లోడ్​ అధికమై బోల్తాపడిన ట్రాక్టర్

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం పాత దాంరాజ్‌పల్లిలోని గోదావరి నుంచి ఇసుకను నిత్యం దర్జాగా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. ఎప్పటిలాగానే ఇసుకను తీసుకువస్తుండగా గట్టు ఎక్కించబోయాడు. ఇంజిన్ ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచి బోల్తా పడింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ వికాస్‌ అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లోడ్​ అధికమై బోల్తాపడిన ట్రాక్టర్

ABOUT THE AUTHOR

...view details