తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఉపాధికూలీలుగా మారిన ఉపాధ్యాయులు

లాక్​డౌన్​ దెబ్బతో... ప్రైవేటు ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు తెరచుకోకపోవడం వల్ల వారి పరిస్థితి దయనీయంగా మారింది.

By

Published : Jul 4, 2020, 3:30 PM IST

telangana-private-school-teachers-and-graduates-lock-down-problems-during-corona-period
కరోనా దెబ్బ... కూలీలుగా మారిన పట్టభద్రులు..

కరోనా దెబ్బ... కూలీలుగా మారిన పట్టభద్రులు..

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చితికిపోవడం వల్ల... పట్టభద్రులు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు ఇంకా తెరచుకోకపోవడంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆర్థిక కష్టాలు ఎదురవుతుండటంతో ఉపాధి హామీ పనులకు వెళ్లాల్సి వస్తోందని అంటున్నారు.

జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, పట్టభద్రులు పలుగు, పార పట్టుకుని పనులకు వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి ఉపాధి హామీ కొంత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తుండగా... పట్టణాల్లో ఉండేవారికి ఆ ప్రత్యామ్నాయమూ లేదు.

ఇదీ చూడండీ:'లాక్​డౌన్​లో పనిచేసిన లెక్చరర్లకు జీతాలివ్వాలి'

ABOUT THE AUTHOR

...view details