తెలంగాణలో పేరొందిన ఆలయాల్లో ఒకటైన ధర్మపురికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లక్ష్మీ నారసింహుడే కాదు వేంకటేశ్వరుడు, రామలింగేశ్వర స్వామి విగ్రహాలతో పాటు యమధర్మరాజు కూడా కొలువుతీరారు. ఇక్కడకు వచ్చిన భక్తులు యమధర్మరాజును కూడా తప్పకుండా దర్శించుకుంటారు.
భరణి నక్షత్రం ప్రత్యేకం
ఇవాళ భరణి నక్షత్రం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన ఈ రోజు స్వామికి అర్చకులు రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుసూక్తం, యమసూక్తంతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు చెల్లించుకున్నారు.