జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్కు ప్రమాదం తప్పింది. 50 మంది విద్యార్థులతో తీసుకెళ్తున్న బస్... వేగంగా వెళ్లి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మిషన్ భగీరథ కోసం తవ్విన పైపు లైను మట్టిలో టైర్లు కూరుకుపోయాయి. ప్రమాదం త్రుటిలో తప్పినందున తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
పాఠశాల బస్కు త్రుటిలో తప్పిన ప్రమాదం
50 మంది విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు... వేగంగా వెళ్లి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి ఆగిపోయింది. ప్రమాదం త్రుటిలో తప్పినందున... అందరు ఊపిరి పీల్చుకున్నారు
పాఠశాల బస్కు త్రుటిలో తప్పిన ప్రమాదం