తెలంగాణ

telangana

మెట్​పల్లిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

By

Published : Nov 7, 2019, 6:34 PM IST

తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన


జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా.. సర్కారుకు పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న.. తెరాస ఇప్పుడు వారినే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు దిగివచ్చి కార్మికులతో చర్చలు నిర్వహించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details