జగిత్యాలలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
రంగారెడ్డి జిలా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ జగిత్యాల జిల్లా ఆర్డీవో కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.