తెలంగాణ

telangana

By

Published : May 7, 2021, 2:42 AM IST

ETV Bharat / state

అకాల వర్షంతో అన్నదాత ఆగమాగం

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం నీటి పాలైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కురిసిన వర్షానికి వరి ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది.

rain
వర్షం

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కురిసిన ఆకాల వర్షం రైతులను నిలువునా ముంచింది. మండలంలోని కొండాపూర్‌, భీమారం, రంగాపూర్, దేశాయిపేట, గోవిందారం గ్రామాల్లో భారీ వర్షం కురియటంతో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది.

భారీగా వీచిన గాలితో మామిడి కాయలు రాలిపోయి నష్టం వాటిల్లింది. వరి ధాన్యం నీటి ప్రవహానికి కొట్టుకుపోయింది. ఇంకా కోత పూర్తి కానీ వరి పంట పడిపోయినట్లు రైతులు తెలిపారు.. తడిచిస ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

వర్షం

ఇదీ చదవండి:నేడు మేయర్​, ఛైర్మన్ల ప్రమాణస్వీకారం

ABOUT THE AUTHOR

...view details