పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు జవాన్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
మెట్పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం
పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మెట్పల్లిలో ఘనంగా పుల్వామా అమరవీరుల దినోత్సవం