జగిత్యాల జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలో 51 సహకార సంఘాలు ఉండగా.. అందులో 5 సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. ప్రస్తుతం 46 సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 349 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సహకార పోలింగ్
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సహకార ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్
ఎన్నికల బరిలో 829 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:అలా చేస్తే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తీసేస్తాం: కేటీఆర్