తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలుక కరిచిందని పడుకున్నాడు.. చివరకు చనిపోయాడు..

ఇంట్లో హాయిగా నిద్రపోతున్న ఓ యువకున్ని పాము కాటేసింది. కానీ తాను ఎలుక కరిచిందనుకుని అలాగే పడుకున్నాడు. ప్రాణాలు కోల్పోయాడు.

By

Published : Aug 17, 2019, 12:26 PM IST

ఎలుక కరిచిందని పడుకున్నాడు.. చివరకు చనిపోయాడు..

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్​లో ఓ యువకున్ని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. ఒల్లపు శ్రీకాంత్ అనే 17 ఏళ్ల యువకుడు ఇంట్లో నిద్రిస్తుండగా పాము కరిచింది. అయితే ఎలుక కరిచిందనుకుని అలాగే పడుకున్నాడు. శరీరంలో తేడా కనిపించడం వల్ల వెంటనే తేరుకొని ఆస్పత్రికి పరుగులు తీశాడు. కానీ మార్గ మధ్యలో మరణించాడు. ఉదయం పామును స్థానికులు గుర్తించి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఎలుక కరిచిందని పడుకున్నాడు.. చివరకు చనిపోయాడు..

ABOUT THE AUTHOR

...view details