'వైద్యులపై దాడులకు నిరసనగా ఓపి సేవలు బంద్' - JAGITYAL DISTRICT
వైద్యులపై జరిగిన దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లాలో పలు ఆసుపత్రులు ఓపి సేవలను నిలిపేశాయి. పట్టణంలో వైద్య సేవలు నిరాకరించడం వల్ల రోగులు ఇబ్బందులు పడ్డారు.
!['వైద్యులపై దాడులకు నిరసనగా ఓపి సేవలు బంద్'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3581351-thumbnail-3x2-jgtl.jpg)
ప్రభుత్వాసుపత్రిల్లో గంట పాటు ఓపి సేవలు బంద్
కోల్కత్తాలో వైద్యులపై దాడులకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓపి సేవలు నిలిపేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలోనూ వైద్యులు సుమారు గంట పాటు ఓపి సేవలను నిరాకరించి నిరసన తెలియజేశారు. అనంతరం దాడిని ఖండించారు. ప్రైవేట్ వైద్యశాలల్లోనూ సేవలు నిలిపివేయడం వల్ల జగిత్యాల పట్టణంలో రోగులు లేక ఆసుపత్రులు ఖాళీగా ఉన్నాయి.
వైద్య సేవలు నిరాకరణ వల్ల రోగుల ఇబ్బందులు