తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు

అప్పు ఇవ్వడం లేదని.. నమ్మిన స్నేహితులే అతన్ని కడతేర్చారు. మద్యం తాగుదామని తీసుకెళ్లి.. మెల్లగా గొడవ మొదలు పెట్టారు. సీసాలతో పొడిచి చంపి తమ కోపాన్ని తీర్చుకున్నారు. ఈ దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : Dec 31, 2019, 5:37 PM IST

one person killed by friends in jagtial district
అప్పు ఇవ్వడం లేదని.. స్నేహితుడినే చంపేశారు

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం నర్సింహులపల్లెలో దారుణం చోటుచేసుకుంది. కల్లు దుకాణం సమీపంలో ఆర్మూర్‌ గంగాధర్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గంగాధర్​ ఈ మధ్యే తన పొలాన్ని విక్రయించగా.. రూ. 5 లక్షలు వచ్చాయి. అప్పటి నుంచి గంగాధర్​ స్నేహితులైన నారాయణ, రవిలు అప్పు ఇవ్వమంటూ అడుగుతున్నారు. గంగాధర్ అప్పు ఇవ్వటానికి​ నిరాకరించాడు. ఈ కోపాన్ని మనసులో పెట్టుకున్న నారాయణ, రవి సమయం కోసం వేచి చూశారు.

సోమవారం రాత్రి గంగాధర్​ను మద్యం తాగేందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మెల్లగా గొడవ మొదలుపెట్టి... తమ కోపాన్ని ప్రదర్శించారు. మద్యం సీసాలతో పొడిచి చంపారు.

రక్తపు మడుగుల్లో పడి ఉన్న గంగాధర్​ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నారాయణ, రవి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ రాజేశ్​ వెల్లడించారు. గంగాధర్​కు భార్య, కొడుకు ఉన్నట్లు తెలిపారు.

అప్పు ఇవ్వడం లేదని.. స్నేహితుడినే చంపేశారు

ఇదీ చదవండి : మత్తు సూదిచ్చారు... ఆపరేషన్ ఆపేశారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details