తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరద నీటిని నిల్వ చేసుకోవడానికేనా కాళేశ్వరం ప్రాజెక్టు...?'

కాళేశ్వరం ప్రాజెక్టు వరద నీటిని నిల్వ చేసుకునేందుకు తప్ప నీటిని ఎత్తిపోసేందుకు పని చేయదంటూ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఎద్దేవా చేశారు.

By

Published : Sep 21, 2019, 5:41 PM IST

MLC_JEEVANREDDY_FIRE_ON KCR_ABOUT_KALESHEWARAM PROJECT

గోదావరి ద్వారా నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి జగిత్యాలలో ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎల్లంపల్లిలోకి వచ్చిన కడెం ప్రాజెక్టు నీటినే... మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలోకి 16 టీఎంసీలు ఎత్తిపోశారని వివరించారు. ప్రాజెక్టునుంచి చుక్కనీరు పైకి ఎత్తిపోయలేదని... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరద నీటిని నిల్వ చేయటానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుకు అదనంగా రూ. 4 వేల 6 వందల కోట్ల పనులను నామినేషన్‌ పద్దతిలో అప్పగించడాన్ని బట్టి అవినితీ ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని జీవన్‌రెడ్డి వివరించారు.

'వరద నీటిని నిల్వ చేసుకోవడానికేనా కాళేశ్వరం ప్రాజెక్టు...?'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details