మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తన నివాసంలో 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటి ఆవరణలోని పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించారు. పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు.