తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు అండగా ఉండేందుకే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​' - జగిత్యాల జిల్లా తాజా వార్తలు

పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు.

MLA Vidyasagar Rao distribute Kalyana Lakshmi checks
మెట్​పల్లిలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి

By

Published : Mar 1, 2020, 2:43 PM IST

పేదలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన 118 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులతో కిటకిటలాడింది.

మెట్​పల్లిలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి

ఇదీ చూడండి:నా పక్షి పోయింది.. వెతికి పెట్టండి!

ABOUT THE AUTHOR

...view details