తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదల అభ్యున్నతే తెరాస లక్ష్యం'

స్వరాష్ట్ర ఆకాంక్ష సిద్ధించి ఆరేళ్లు పూర్తి చేసుకుని, ఏడో ఏట అడుగెడుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్లలో నిరాడంబరంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు.

By

Published : Jun 2, 2020, 3:30 PM IST

telangana formation day  in jagtial
జగిత్యాల జిల్లాలో తెలంగాణ అవతరణ వేడుకలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్లలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మెట్​పల్లి ప్రభుత్వాసుపత్రితో పాటు, కోరుట్ల తెరాస కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు.

పేద ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్​పల్లి పురపాలక కార్యాలయంలో ఛైర్​పర్సన్ సుజాత జాతీయ జెండాను ఎగురవేసి పట్టణ ప్రజలకు, కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details