తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2020, 11:54 AM IST

Updated : Feb 9, 2020, 12:00 PM IST

ETV Bharat / state

కురిక్యాల ప్రమాద కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

టాటా ఏస్​ను లారీ ఢీ కొట్టిన ఘటన జిగిత్యాల జిల్లా కురిక్యాలలో చోటుచేసుకుంది. ప్రమాదంలో పూడూర్​కు చెందిన ఐదుగురు దుర్మరణం చెందగా, మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు.

mla comforted family members of kurikyala accident at jagtial
కురిక్యాల ప్రమాద కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడుర్, గౌరాపూర్ గ్రామాల్లో కురిక్యాల రహదారి ప్రమాదంతో విషాదకరంగా మారింది. మృతుల కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరామర్శించారు. సమీప బంధువులైన మృతులు ఐదుగురు కరీంనగర్​లో వైద్య పరీక్షలు పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా గంగాధర మండలం కురిక్యాల వద్ద టాటా ఏస్​ను లారీ ఢీకొనడంతో మృతి చెందారు.

పూడూరు గ్రామానికి చెందిన గడ్డం అంజయ్య, గౌరాపుర్ గ్రామస్తులు మేక బానయ్య, అతని కుమారుడు మేక నరేష్, సోదరుడు మేక నర్సయ్య, సోదరుని కుమారుడు మేక బాబులు మృతి చెందారు. మృతులంతా ప్రయాణించిన టాటా ఏస్ వాహనం డ్రైవర్ గడ్డం అంజయ్య కూడా మేక బానయ్యకు మేనల్లుడు కావడం వల్ల బంధువుల రోదనలు మిన్నంటాయి.

కురిక్యాల ప్రమాద కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి :ఐదుగురు సర్పంచ్​ల చెక్​పవర్​ రద్దు చేసిన కలెక్టర్​

Last Updated : Feb 9, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details