జగిత్యాల జిల్లా మెట్పల్లి మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. గురుకులం సమీపంలో ఓ వ్యక్తి బోర్ వేసేందుకు యంత్రాలతో ప్రయత్నించడం వల్ల పైప్లైన్ పగిలిపోయింది. వందలాది లీటర్ల తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహించింది. పైప్లైన్ నుంచి నీరు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న గురుకులంలోకి నీరు చేరింది. విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు తడిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మరమత్తు చర్యలు చేపట్టారు.
పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్.. తడిచిన పుస్తకాలు - పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్
జగిత్యాల జిల్లా మెట్పల్లి మైనార్టీ గురుకులం సమీపంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. ఓ వ్యక్తి బోర్ వేసేందుకు ప్రయత్నించడం వల్ల పక్కనే ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. అక్కడి నుంచి నీరు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న గురుకులంలోని చేరింది. విద్యార్థుల పుస్తకాలు తడిచిపోయాయి.
![పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్.. తడిచిన పుస్తకాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3936906-9-3936906-1563985841674.jpg)
పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్.. తడిచిన పుస్తకాలు
పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్.. తడిచిన పుస్తకాలు
ఇవీ చూడండి: శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !