తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి కోసం సరిహద్దు దాటి.. ఎట్టకేలకు ఇల్లు చేరాడు! - migrant labor reached jagtial from dubai

ఉన్న ఊళ్లో ఉపాధి లేక.. దేశం కాని దేశం వెళ్లి లాక్​డౌన్​ వల్ల అక్కడే చిక్కుకుపోయిన ఓ వలస కార్మికుడు ప్రవాస మిత్ర సాయంతో ఎట్టకేలకు సొంతూరు చేరాడు. రెండేళ్ల క్రితం వెళ్లిన తమ కుమారుడు ఇంటికి చేరుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

migrant labor reached home town in jagtial district from Dubai
దుబాయ్ నుంచి జగిత్యాలకు చేరుకున్న వలస కార్మికుడు

By

Published : Sep 21, 2020, 12:51 PM IST

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన కొక్కుల రాజేందర్ అనే యువకుడు సొంత ఊళ్లో ఉపాధి దొరకక 2018లో ఓ ఏజెంట్ సాయంతో ఒమన్​కు చేరుకున్నాడు. అక్కడ కూడా ఉపాధి లభించకపోవడం వల్ల నడకమార్గంలో ఒమన్​ నుంచి మస్కట్​ సరిహద్దు దాటి దుబాయికి వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ ఇన్నాళ్లు బతికాడు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విధించిన లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి, అక్రమ మార్గంలో దుబాయికి వెళ్లడం వల్ల స్వదేశానికి రాలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఈ విషయం ప్రవాస మిత్ర లేబర్ యూనియన్​కు తెలపగా.. విదేశీ మంత్రిత్వ శాఖ దుబాయిలోని రాయబార కార్యాలయ దృష్టికి తీసుకెళ్లింది. రాయబార కార్యాలయ అనుమతులు పొంది ఎట్టకేలకు రాజేందర్.. తన ఇంటికి చేరుకున్నాడు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లిన తమ కుమారుడు.. ఇంటికి చేరడం వల్ల అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details