తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ వివాదంలో నడిరోడ్డుపై హత్యాయత్నం - భూతగాదాలు

భూ తగాదాల విషయం ఇద్దరి మధ్య తగాదాకు కారణమైంది. జగిత్యాల జిల్లాలో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది.

గొడ్డలి దాడి

By

Published : Apr 15, 2019, 2:24 PM IST

Updated : Apr 15, 2019, 2:44 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓవ్యక్తి ఇంకో వ్యక్తిపై విచక్షణా రహితంగా గొడ్డలితో దాడి చేశాడు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన తిప్పర్తి కిషన్​, లక్ష్మణ్​ భూతగాదాల విషయంలో రోడ్డుపై తగాదా పడ్డారు. అనంతరం లక్ష్మణ్​ తన ద్విచక్ర వాహనం నుంచి గొడ్డలి తీసి కిషన్​పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. స్థానికులు ఈ ఘటన చూసి భయ భ్రాంతులకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన కిషన్​ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తిపై గొడ్డలితో దాడి
Last Updated : Apr 15, 2019, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details