తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్లన్న సన్నిధిలో ఘనంగా బోనాల జాతర - తెలంగాణ వార్తలు

జగిత్యాల జిల్లా వెంకటరావుపేటలో మల్లన్న స్వామికి ఘనంగా జాతర నిర్వహించారు. భారీ ఊరేగింపుతో డప్పు చప్పుళ్ల నడుమ స్వామివారికి బోనాలు సమర్పించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.

mallanna swamy bonalu at jagtial district venkatarao peta
మల్లన్న స్వామికి ఘనంగా బోనాల జాతర

By

Published : Jan 4, 2021, 11:37 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆవాస గ్రామం వెంకటరావుపేటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. ఘనంగా జాతర నిర్వహించారు. ఉపవాస దీక్షలో ఉండి స్వామివారికి పూజలు చేశారు.

డప్పు చప్పుళ్ల నడుమ వీధి వీధిన బోనాల ఊరేగింపు చేసి.. గ్రామ శివారులో ఉన్న మల్లన్న స్వామివారికి సమర్పించారు.పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఊరేగింపును ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాంగణమంతో భక్తులతో నిండిపోయింది. మల్లన్న నామ స్మరణతో గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొంది.

ఇదీ చూడండి: మార్పును ఆహ్వానిస్తున్న జనం... ఈ- బైక్​లకు పెరుగుతోన్న ఆదరణ

ABOUT THE AUTHOR

...view details