తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాలపై కరోనా పంజా.. మరో ఊరిలో స్వచ్ఛంద లాక్​డౌన్ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ ప్రభావంతో చాలా గ్రామాల్లో ఇప్పటికే స్వచ్ఛంద లాక్​డౌన్ విధించుకున్నాయి. జగిత్యాల జిల్లాలోని మరో గ్రామం లాక్​డౌన్ ప్రకటించింది. ఊరిలో 30 మందికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.

lock down in katakpur village, corona cases in kakatpur village
కట్కాపూర్ గ్రామంలో లాక్​డౌన్, కట్కాపూర్ గ్రామంలో కరోనా కేసులు

By

Published : Apr 7, 2021, 3:47 PM IST

రాష్ట్రంలోని గ్రామాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండో దశలో వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జగిత్యాల జిల్లాలో బాధితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే పలు గ్రామాలు స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రకటించుకున్నాయి. తాజాగా రాయికల్ మండలం కట్కాపూర్‌ గ్రామంలో 30 మందికిపైగా వైరస్ నిర్ధారణ అయింది. ఫలితంగా ఆ ఊరిలో లాక్​డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది.

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున లాక్​డౌన్‌ విధిస్తున్నట్లు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరవాలని నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధిస్తామని పంచాయతీ అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details