తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టంతా రాష్ట్రాభివృద్ధిపైనే' - mla vidya sagar rao visit to metpally

ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల పూర్తి స్థాయి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు.

జగిత్యాలలో ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు పర్యటన

By

Published : Oct 29, 2019, 3:40 PM IST

జగిత్యాలలో ఎమ్మెల్యే విద్యాసాగర్​ రావు పర్యటన

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలంలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు పర్యటించారు. రేగుంటలో బీటీ రోడ్డు నిర్మాణం, ఇబ్రహీంపట్నంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 30 రోజుల ప్రణాళిక ద్వారా పల్లెలు అందంగా తయారయ్యాయని అన్నారు. పట్టణాలను కూడా సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల పూర్తి స్థాయి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details