తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2019, 10:50 AM IST

ETV Bharat / state

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

మెట్​పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మహిళలు దీపారధన చేశారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇస్కాన్​ మందిర నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్తీకదీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు. స్వామివారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. హరే క్రిష్ణ మందిరం నిర్వాహకుడు నరహరి దాస్ భక్తులకు ప్రవచనాలు చేశారు.

ఈ మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోధుమ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో వత్తులను వెలిగించి మహిళలు దీపారాధన చేశారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం

ఇదీ చూడండి: 'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details