తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో పాత్రికేయుల ధర్నా

ప్రభుత్వం పాత్రికేయులకు హామీలను వెంటనే తీర్చాలని కోరుతూ కోరుతూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆందోళన నిర్వహించారు.

By

Published : Oct 4, 2019, 6:05 PM IST

జగిత్యాల జిల్లాలో పాత్రికేయుల ధర్నా

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో పాత్రికేయులు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. సబ్ కలెక్టర్ గౌతమ్​కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం పాత్రికేయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెండింగ్​లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లతో పాటు హెల్త్ కార్డులు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఏళ్లతరబడి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ప్రజల పక్షాన నిలుస్తున్న తమను ప్రభుత్వం చిన్న చూపు చూడడం బాధాకరమని సంఘం సభ్యులు తెలిపారు.

జగిత్యాల జిల్లాలో పాత్రికేయుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details