తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 9:07 AM IST

ETV Bharat / state

జగిత్యాల కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన రైతుల అరెస్టు

ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా చెరుకు రైతులు ఛలో కలెక్టరేట్​కు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను భగ్నం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రైతు నాయకులను పోలీసులు రాత్రికి రాత్రే అరెస్టు చేశారు.

jagtial farmers, sugarcane farmers, muthyampet sugar factory
జగిత్యాల రైతులు, చెరుకు రైతులు, ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ

జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు ఛలో కలెక్టరేట్​కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ధర్నాను భగ్నం చేసేందుకు ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది రైతు నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు.

తమ నాయకుల్ని అరెస్టు చేసినా.. తామే ముందుడి ఈ ధర్నా కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details