లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో చందనోత్సవం - navaratri utavalu
ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చందనోత్సవం
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ఉగ్ర, యోగ లక్ష్మీ నరసింహస్వామి మూల విగ్రహాలకు చందన విలేపనం చేశారు. జిల్లా కలెక్టర్ శరత్ చందనోత్సవంలో పాల్గొన్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
చందనోత్సవం