52 రోజుల పాటు సమ్మె చేసిన కార్మికులు సమ్మె విరమించడం... రెండ్రోజుల తర్వాత సీఎం కేసీఆర్ బేషరతుగా కార్మికులు విధుల్లో చేరవచ్చని చెపప్పడంతో కార్మికులు తెల్లవారుజాము నుండే విధుల్లో చేరారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల డిపోల్లో కార్మికులు విధుల్లో చేరేందుకు డ్యూటీ డ్రెస్ ధరించి ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకున్నారు. విధులు నిర్వర్తించేందుకు రిజిస్టర్లో సంతకాలు చేసి తమ రూట్లలోకి బస్సులను తీసుకెళ్లారు. చాలా రోజుల తర్వాత బస్సులు నడపడం చాలా సంతోషంగా ఉందని కార్మికులు తెలిపారు.
'బస్సులు నడపడం చాలా సంతోషంగా ఉంది' - జగిత్యాల జిల్లాలోని బస్సు డిపోల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు
విధుల్లో హాజరయ్యేందుకు జగిత్యాల జిల్లాలోని బస్సు డిపోల్లోకి కార్మికులు తరలివస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆనందంగా బస్సులు నడుపుతున్నారు.
'బస్సులు నడపడం చాలా సంతోషంగా ఉంది'